Sunday, December 20, 2020

మానవ ఆకారంలో సిద్ధేశ్వరస్వామి



మానవ ఆకారంలో సిద్ధేశ్వరస్వామి

దక్షిణ భారతదేశంలోని శివాలయాల్లో శివుడు లింగాకృతిలో ఉండగా అమరాపురం మండలం హేమావతి సిద్దేశ్వరాలయంలో మానవాక్ృతిలో (విగ్రహం రూపంలో) కొలువుదీరడం విశేషం క్రీ. శ. 730లో నోళంబ పల్లవులు హేమావతిని రాజధానిగా చేసుకుని పాలించినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. అప్పట్లో హేమావతిని యెంజేరు పట్టణంగా అనంతరం హైమవతిగా కాలక్రమేణ హేమవతిగా పిలుస్తున్నారు. ఇక్కడి ఆలయంలోని శిల్పాలు నల్లని రాతితో చూడచక్కగా మలిచారు. గ్రామంలో ఎక్కడ తవ్వకాలు చేసినా నంది విగ్రహాలు, శివలింగాలు లభ్యమవుతుంటాయి. విలువైన శిల్పాలను 50 ఏళ్ల కిందట మద్రాసు మ్యూజియానికి తరలించారు. ప్రస్తుతం రూ.50 లక్షలతో నిర్మించిన భవనంలో శిల్పాలను భద్రపరిచారు. శివుడు సిద్ధాసనం భంగిమలో కూర్చొని ఉన్నందున సిద్ధేశ్వరస్వామిగా పూజలందుకుంటున్నాడు. ఏటా మహాశి వరాత్రి నుంచి 9 రోజులపాటు శిరాత్రి మహోత్సవాలు ఆల యంలో ఘనంగా జరుగుతాయి. ఉత్సవాలకు జిల్లాలోని నలుమూలలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు




నాటి గొల్లపల్లే.. నేటి పుట్టపర్తి






       ప్రేమ శాంతి ధర్మం సహనం సమత మమత సేవాతత్పరతకు అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న పుట్టపర్తి నాటి గొల్లపల్లే సత్యసాయి జన్మించిన గ్రామం. చిత్రావతి నది ఒడ్డున కొండకోనల్లోని గొల్లపల్లి లోని సామాన్య కుటుంబంలో ఈశ్వరమ్మ, పెద్దవెంకమరాజు దంపతులకు సత్యసాయి 1926 నవంబర్ 23న జన్మించి, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆరాధ్యుడిగా పూజలందు కుంటున్నారు. నాడు గొల్లపల్లిలో అధిక శాతం యాదవులు గోవులను పోషించేవారు. ఒక యాదవ యాజమానికి చెందిన ఆవు మేతకు వెళ్లి, ప్రతి రోజూ పుట్టలోని పాముకు పాలు ఇచ్చేది. ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ ఆవులు పాలు ఇచ్చేవి. ఈ ఆవు పాలు ఇచ్చేది కాదు. ఆవు మధ్యాహ్న సమయంలో పుట్టవద్దకు వెళ్లి, పాముకు పాలు ఇస్తుండగా యజమాని గమనించి పామును రాయితో చంపాడు. పాము చనిపోతూ గొల్లపల్లి.. పుట్టలమయంగా మారాలని శపించిందట. పుట్టవద్ద ఉన్న రాతికి ప్రజలు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి వేణు గోపాలస్వామి ఆలయం నిర్మించారు. అలా పుట్టపర్ధిని కాస్తా పుట్ట పర్తిగా ప్రసిద్ధికెక్కింది.