Sunday, January 24, 2021

లేపాక్షి ఖ్యాతి ఫ్రభవిల్లిన కీర్తి



నాటి వైభవానికి గుర్తింపు • గణతంత్ర పరేడ్ లో శకటం ప్రదర్శన

విజయనగర రాజుల ప్రముఖ వాణిజ్య కేంద్రంగా.. చిత్ర, శిల్పకళా సౌందర్యానికి కాణాచిగా... లేపాక్షి ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఇప్పటికే గుర్తింపు పొందింది.2021,జనవరి, 26న ఢిల్లీ రాజ్ పథ్ వేదికగా నిర్వహించే గణతంత్ర వేడుకల్లో మరోమారు విశ్వవ్యాప్తం కానుంది. మన రాష్ట్రం తర పున 'లేపాక్షి శకటాన్ని పరేడ్లో ప్రదర్శించనున్నారు. 

శిల్పుల నైపుణ్యానికి నిదర్శనం ఏడు శిరస్సుల నాగేంద్రుడు

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో లేపాక్షి దుర్గా పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని విజయనగర కాలంలో కోశాధికారిగా ఉన్న విరూపణ్ణ, వీరన్న అనే అన్నదమ్ములు 1522-1588 వరకు 16 సంవత్సరాల పాటు నిర్మిం చారు. ఆలయం మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో తాబేలు ఆకారంలో ఉన్న కొండ పై పునాది లేకుండానే నిర్మించడం

ఎంతో ఘన చరిత్ర కలిగిన లేపాక్షి ఆలయ ఘనకీర్తి పర్యాటకశాల ఆధ్వర్యంలో  నిర్వహించిన ఉత్సవాలతో విశ్వవ్యాప్తమైంది  మొదట 2012లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్సవాలు నిర్వహించగా, తర్వాత అధికారంలోకి వచ్చిన తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణ నేతృ త్వంలో రెండుసార్లు ఉత్సవాలను కనుల పండువగా నిర్వహించి లేపాక్షికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.

రాజుల కాలంలో శ్రీకృష్ణదేవరాయలసోదరుడు అచ్యుతదేవరాయలు ఆస్థా 

  
 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలో నిర్వహించే పరేడ్లో లేపాక్షి శకటంలో  
ప్రపంచంలోనే అతి పెద్ద రాతి నంది విగ్రహం శకటానికే ప్రత్యేక ఆకర్షణగా నిలవ నుంది. ఆలయ అద్భుత నిర్మాణ శైలి, ముఖ మంటపం, అధ్యాంతరంగా ఆగిన కల్యాణ మంటప నమూనాను ప్రదర్శిం చనున్నారు. రాతితో చెక్కిన పెద్ద వినాయకుడు, ఏడు శివ స్సుల నాగేంద్రుని ప్రతిమ శకటంలో ఆకర్షణగా నిలవనుంది దక్ష యజ్ఞం లో వీరభద్రుడి ఉగ్రరూపాన్ని చాటేలా శకటం ముందుకు సాగే సమయంలో వీరకైవుల సంప్రదాయ కళ రూప నృత్యాన్ని కళాకారులు ప్రదర్శించనున్నారు.




ఆలయంలోని నాట్యమంటపం, బతా

మంటపం, అర్ధాంతరంగా ఆగిన కల్యాణ మంటపం, వేలాడే స్తంభం ఏడు శిరస్సులు నాగేంద్రుడు, సీతమ్మ పాదం ఎటుచూసిన మనవైపే చూసే శ్రీకృష్ణుని తైలవర్ణ చిత్రం ఇలా ఎన్నో చారిత్రక నేపథ్యమున్న ఇతిహాసాలు నాటి శిల్పుల నైపుణ్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ఆలయంలో మొత్తం 878 స్తంభాలు ఉండగా ఒక్కో స్తంభం ఒక్కో చరిత్రను ప్రస్పుటించేలా శిల్పులు చెక్కారు. ఆలయం గర్భగుడి పైకప్పుపై సహజ రంగులతో 24 అడు గుల పొడవు. 14 అడుగుల వెడల్పుతో గీచిన వీరభద్రస్వామి తైలవర్ణ చిత్రం ఆసియాలోనే అతి పెద్ద చిత్రంగా ప్రఖ్యాతి చెందింది. ఆలయంలో వీరభ ద్రస్వామి, దుర్గాదేవి అమ్మవార్లు ప్రధాన దేవ తలు.

విశేషం. ఈ ఆలయం కట్టక ముందే ఇక్కడ సీతాదేవి మోపిన పాదం, రాముడు ఆంజనేయుడు, చోళరాజు, ఆగస్త్య మహర్షి ప్రతిష్టించిన లింగాలతో పాటు వీరభద్రుడు స్వయంభు వుగా వెలసిన లింగం ఉంది. ఇలా బర్కడ ఐదు లింగాలు, సీత మ్మపాదం ఒకేచోట ఉండటం చూసిన విరూపణ్ణ అచ్యుతదేవరా యలు అనుమతితో ఆలయ నిర్మా ణానికి పూనుకున్నారు. ఆలయం మొత్తం ఏడు ప్రాకారాల్లో నిర్మించగా ప్రస్తుతం మూడు ప్రాకారాలు మాత్రమే

కనబడతాయి

ప్రపంచంలోనే పెద్ద ఏకశిలా నంది

విజయనగర రాజుల కాలంలో లేపాక్షిలో చెక్కిన ఏకశిలా రాతి నంది విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దదిగా మొదటి స్థానంలో నిలిచింది. ఈ నంది విగ్రహం 27అడుగుల పొడవు, 18అడు గుల వెడల్పు ఉంది. ఇది ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో తమిళనాడు రాష్ట్రం తంజావూరు మైసూరు చాముండి హిల్స్, బెంగళూరు నంది విగ్రహాలు ఉన్నాయి.

Date : 24/01/2021 EditionName : ANDHRA PRADESH( ANANTAPUR. ) Page

No comments:

Post a Comment