చిన్నారులూ
పాపాగ్ని నది సత్యసాయి జిల్లా కు సుమారు 180కి.మీ దూరం నందికొండల్లో పుడుతుంది.ఈ నంది కొండలు కర్నాటక రాష్ట్రంలో చిక్కబళ్లాపూర్ అనే జిల్లాలో ఉన్నాయి.
వానలు బాగా పడితే ఈ నదిలో నీళ్లు బాగా పారి కర్నాటక రాష్ట్రంలో ఉన్న కోలార్ జిల్లాలో ఉండే భూములకు నీళ్లిస్తుంది.అక్కడి నుంచి చిత్తూరు జిల్లా కు వస్తుంది.మళ్లీ అక్కడి నుంచి సత్యసాయి జిల్లాలో అమడగూరు,తనకల్లు, నల్లచెరువు,కదిరి, ముదిగుబ్బ, తలుపుల,నంబులపూలికుంట మండలాల్లో పారుతుంది.తరువాత అన్నమయ్య జిల్లాలోని గాలివీడు మండలంలోకి పోతుంది.
అన్నమయ్య జిల్లాలోని గాలివీడు మండలంలో పాపాఘ్ని నదిపై వెలిగల్లు రిజర్వాయర్కు నిర్మించారు. దీనికి ‘వైఎస్సార్ వెలిగల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్’గా పేరు పెట్టారు.
పాపాగ్ని నది అక్కడి నుండి వైఎస్సార్ జిల్లాలో గండి అనే ఊరు మీదుగా వెళుతుంది.ఈ నది ఒడ్డునే గండిలో ఆంజనేయస్వామి గుడి కూడా ఉంది. ఇది మెల్లగా కమలాపురం మండలంలో పెన్నా నదిలో కలుస్తుంది.అంటే ఈ నది పెన్నానది కి ఉప నదన్నమాట.
ఈ నది కి వానలు పడి నీళ్లు వస్తే 8250ఎకరాల నేలలో పంటలు పండించుకోవచ్చు.
___ కుమారస్వామి,9490122229
No comments:
Post a Comment