Thursday, August 27, 2020

రాయదుర్గం



     ఒకప్పుడు చేనేత పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిన కాలంలో 1980 ,90 వ దశకంలో రాయదుర్గంలో సిల్క్ ట్విస్టింగ్ మరియు రీలింగ్ ఫ్యాక్టరీలు సుమారు 45 దాకా ఉండేవి. ప్రస్తుతం 5 నుండి 10 ట్విస్ట్టింగ్ ఫ్యాక్టరీలు మాత్రం ఉన్నాయి. అందులో పనిచేసే కార్మికుల సంఖ్య వందకు లోపే. 
            రాయదుర్గం  లో 2002-03లో 37 సిల్క్    ఫ్యాక్టరీలు ఉండగా 2003-04 నాటికి అవి 23కు తగ్గిపోయాయి. ఫలితంగా శ్రామికుల సంఖ్య 419 నుండి 322కు తగ్గిపోయింది. ఉపాధి ప్రతి
ఏడాదికి ఇలా తగ్గిపోతూ వుంటే ప్రజాజీవనం గగనమవుతున్నది. చిన్నతరహా పరిశ్రమలు (10,000 రూ|| ఆపైన యూనిట్లు) 310 వున్నాయి. వీటిల్లో 1684 మందికి ఉపాధి లభిస్తోంది.

        రాయదుర్గంలో ప్రధానంగా జీన్స్ బట్టల కుట్టే యూనిట్లు బాగా అభివృద్ధి చెందుతున్నాయి.
జీన్స్ బట్టను కర్నాటక ప్రాంతం(బళ్లారి) ప్రాంతం నుంచి తెచ్చుకొని వాటిని దుస్తులుగా కుట్టి
బెంగుళూరు తదితర ప్రాంతాలలో విక్రయి స్తున్నారు. ఇదే ప్రధాన ఆదాయ వనరుగా వుంది. 
     రాయదుర్గం పట్టణంలో'' పుర 'పథకం కింద  కామన్ ఫెసిలిటీ సెంటర్ 15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడింది .ఇక్కడ కొంత కాలం రెడీమేడ్ గార్మెంట్ పరిశ్రమలో పనిచేయు కార్మికులకు కుట్టు శిక్షణ ఇవ్వబడింది ..ప్రస్తుతం ఈ కేంద్రం మూతపడింది. రాయదుర్గం మండలం 74 -ఉడేగోళం గ్రామం వద్ద  చేనేత మరియు జవుళి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 15 సంవత్సరాల క్రితం టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయబడింది. 55 పరిశ్రమలకు గాను ప్రస్తుతం ఐదు పరిశ్రమలు ఏర్పాటై ఉత్పత్తి కొనసాగిస్తున్నాయి. 55 సంవత్సరాల క్రితం రాయదుర్గం పట్టణంలో రెడీమేడ్ గార్మెంట్స్ పరిశ్రమకు పునాదులు ఏర్పడగా ప్రస్తుతం రాయదుర్గంలో  జీన్స్ కాటన్, మొదలైన మెటీరియల్తో ప్యాంట్లు ఇతర ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ఈ పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా 10 వేల మంది పరోక్షంగా 20,000 మంది పనిచేసి జీవిస్తున్నారు 500 కోట్లకు పైగా టర్నోవర్ నడుస్తోంది. ఇక్కడి ఉత్పత్తులు దక్షిణ భారతంలోని ప్రధాన పట్టణాలు, నగరాల తో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు కూడా మార్కెట్ అవుతున్నాయి. ఈ పరిశ్రమకు అవసరమైన ముడిసరుకు అహ్మదాబాద్, సూరత్ ,ముంబై బళ్లారి, బెంగళూరు నగరాలనుండి తెప్పించ బడుతోంది. ఒకప్పుడు రాయదుర్గం కాటన్ మరియు పట్టు చేనేత చీరల తయారీకి ప్రసిద్ధిచెందినది .
      ఇక్కడ కార్మికులకు జీన్స్ దుస్తుల తయారీలో, ఫ్యాషన్ డిజైన్లలో నైపుణ్యం అందించగలిగితే జీన్స్ఎగుమతి ప్రధాన ప్రాంతంగా మారుతుంది. ఇక్కడ ఆపరెల్ పార్కు ఏర్పాటు చేయడం ఉపయోగకరం.
          ఫ్యాషన్ టెక్నాలజీ టెక్స్ టైల్ టెక్నాలజీ లాంటి ఉపాధి నందించే కోర్సులు ఇక్కడి విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరం. 
           ఈ మండలంలో గ్రానైట్ నిక్షేపాలున్నాయి. వీటిని వెలికి తీస్తే మంచి ఉపాధి లభిస్తుంది.

        ఇక్కడ 5000 చేనేత మగ్గాలు ఉండేవి. అయితే ప్రస్తుతం సుమారు 200 లోపు చేనేత మగ్గాలు ఉన్నాయి. గుమ్మగట్ట మండలం లోని కర్ణాటక రాష్ట్ర సరిహద్దు గ్రామాలలో ఉన్ని కంబళ్ళ తయారీ పరిశ్రమ కేంద్రీకృతమై ఉంది. 
         1000 కంబళ్ళ మగ్గాలు   ఉన్నా యి.   చేనేతను నమ్ముకున్న కార్మికులకు తగిన సహాయ సహకారాలందిస్తే ఉపాధి విస్తరిస్తుంది. కంబళ్ళ మగ్గాలను ప్రోత్సహిస్తే వేలాది కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది.

         రాయదుర్గం మండలం 336 చ.కి.మీ. విస్తీర్ణం కలిగివుంది. 2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం రాయదుర్గం పట్టణ జనాభా 62,017. ప్రస్తుతం రాయదుర్గం పురపాలక సంఘం ద్వితీయశ్రేణి పురపాలక సంఘంగాకొనసాగుతోంది.
మురికి వాడల సంఖ్య 22.వీటిల్లో 54.77% మంది
ప్రజలు ఉన్నారు.ప్రభుత్వ ఆసుపత్రి ఒకటి ఉంది.
మున్సిపాలిటీ లో 34 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 27 ఉన్నత పాఠశాలలున్నాయి.
మండల జనసాంద్రత రాష్ట్ర స్థాయికి సమానంగా 275 వుంది. లింగనిష్పత్తి 976 ఇక్కడ లింగవివక్ష
తక్కువేనని చెప్పవచ్చు (జిల్లా స్థాయి లింగ నిష్పత్తి 958 వుంది). ఈ మండలంలో 20% మంది దళితులున్నారు. 3% మంది గిరిజనులు వున్నారు. 55% మంది ఏ ఉపాధి లేకుండా వున్నవారు ఉన్న 7,842 కుటుంబాలలో 5417(69%) కుటుంబాలు
దారిద్రరేఖ దిగువన జీవిస్తున్నాయి.
        మండలంలో సగటు వర్షం 529మి. మీ. జిల్లా స్థాయితో పోటీ పడుతువుంది. వర్షం అత్యల్పమనే విషయం చెప్పకనే చెపుతోంది. 

        హగరి లేక వేదవతి అనేనది కర్నాటకలో పుట్టి రాయదుర్గం తాలూకాలో ప్రవహిస్తుంది. ఇది తాలూకాలో దక్షిణ దిశ నుండి ప్రవేశిస్తుంది. మధ్యలో చిన్న హగరినది దీనిలో కలుస్తుంది. అక్కడి నుండి నది ఉత్తర దిశగా ప్రవహించి కర్నాటకలోనికి ప్రవహిస్తుంది. ఇదే పెద్దనీటి వనరు. ఈనది ద్వారానే రాయదుర్గం మునిసిపాలిటీకి త్రాగునీరు లభిస్తోంది.
          42 చెరువులున్నాయి. 12 కాలువలు న్నాయి. చెరువుల క్రింద 1407 ఎకరాలు, కాలువల క్రింద 188 ఎకరాలు సాగుచేస్తారు. మొత్తం సాగువిస్తీర్ణం 65% వుంది. బీడు భూములు 26% అడవుల విస్తీర్ణం 9.4%గా వుంది.
         మండల అక్షరాస్యత శాతం 54. పురుషుల్లో 65% ఉండగా మహిళల్లో 43 శాతం మాత్రమే
వుంది. 7 గ్రామాలకు 5కి.మీ. పరిధిలోపల ఉన్నత పాఠశాలలు అందుబాటులో లేవు. ఉపాధ్యాయ,
విద్యార్థి నిష్పత్తి 1: 62గా ఉంది. ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులను ఎక్కువగా నియమించాలి.
      కె.టియస్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అరబిక్ ప్రవేటు డిగ్రీ కాలేజి,రాయల్ పీ.జీ. సెంటర్ వున్నాయి. పట్టణంలో రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు (అందులో ఒకటి బాలికలకు ప్రత్యేకించబడినవి) కలవు. ప్రైవేటు  జూనియర్ కళాశాలలో రెండు ఉన్నాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ,ప్రైవేటు ఐ టి ఐ, కళాశాలలు కూడా ఉన్నాయి.




 





 


No comments:

Post a Comment