బంజారాల మూల పురుషుడు, ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జన్మ స్థలమైన సేవాఘడ్ గుత్తి దుర్గానికి 16 కి.మీ. ల దూరంలో ఉంది.
సేవాలాల్ మహారాజ్ క్రీ.శ.1739లో గుత్తి మండలంలోని చెర్లోపల్లె గ్రామ పంచాయితీలోని సేవాఘడ్ లో జన్మించారు. చాలా సంవత్సరాల
వరకు ఈ స్థలం నిర్జీవమైన గుట్టల ప్రాంతం. చరిత్ర పరిశోధకులు సేవాలాల్ గారి జన్మస్థలం
ఇదేనని కనుగొన్నారు. ఇప్పుడది పవిత్ర స్థలంగా మారింది. అదే సేవాఘడ్.
గుత్తి దుర్గానికి 16కి.మీల దూరంలో ఉన్న రాంజీనాయక్, తాండాకు చెందిన గిరిజనులు
రాజప్రసాదానికి అవసరమైన పాడిని అందించేవారు. తాండాకు పెద్దగా ఉన్న భీమా నాయక్ తో ధర్మణీభాయి వివాహమైంది. 12 ఏళ్లయినా వారికి సంతాన యోగం కలగలేదు. ఎట్టకేలకు ఫిబ్రవరి 15, 1739న భీమా నాయక్, ధర్మణిభాయిలకు మొదటి సంతానంగా శ్రీ సేవాలాల్ భాయ్ రాంజీ నాయక్ తాండాలో జన్మించారు. సేవాలాల్ పుట్టిన తర్వాత తండ్రి భీమ్లానాయక్ తాండాకు పెద్ద దిక్కు అయ్యారు. తాండావాసుల సమస్యల పరిష్కారానికి నడుం బిగించారు.
పంచాయతీలు నిర్వహించేందుకు రచ్చకట్టను నిర్మించి ఆ కట్టపై కూర్చునే తీర్పులు చెప్పేవాడు.
దానినే భీమానాయక్ కట్ట అంటారు. కట్టకు ఎదురుగా ఉన్న బావిని పవిత్ర కాళోకుండ్ గా
పిలుస్తున్నారు.
ఈ కోకుండ్ కు సమీపంలో దండం మోరామో మాత (మారెమ్మ దేవత) గుడి ఉంది. కాలక్రమంగా పెరిగి పెద్ద వాడైనా సేవాలాల్ దేశ సంచారం చేసి వెళ్లిన ప్రతి చోటాఎందరినో ఆపదల నుంచి కాపాడారని ఇక్కడి వారి నమ్మకం.
సేవాలాల్ మహారాజ్ జన్మస్థలమైన సేవాఘడ్ ను పుణ్యస్థలంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నారు.
దాదాపు కోటి 25 లక్షలతో సేవాలాల్ మహారాజ్ ఆలయాన్ని నిర్మించారు.
ప్రతి సంవత్సరం ఆయన జయంతి రోజున పెద్ద ఎత్తున పూజాది కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలు నిర్వహిస్తారు
No comments:
Post a Comment