Saturday, August 29, 2020

అనంతపురం అభివృద్ధికి అడుగడుగునా అవరోధాలు




           1955-56 సం||లో అనంతపురం జిల్లా తలసరి ఆదాయం విషయంలో రాష్ట్ర సగటుకంటే
ఒక మెట్టుపైనే ఉంది. అప్పట్లో రాష్ట్రంలో సగటు తలసరి ఆదాయంలో వ్యవసాయరంగం 57 శాతం,
పరిశ్రమలు 8శాతం, సేవల రంగం 53శాతాన్ని సమకూర్చాయి. 22సం||ల తర్వాత 1977-78లో
రాష్ట్రంలో సగటు తలసరి ఆదాయం 1,018 రూపాయలు మాత్రమే వుంది. అంటే రాష్ట్ర తలసరి
ఆదాయంతో పోలిస్తే జిల్లా వెనుకబడి ఉంది. 2001 నాటికి ఈ అంతరం మరింత పెరిగింది.
1993-94 నుంచి 2000-01 సంవత్సరాల మధ్య రాష్ట్ర సగటు తలసరి ఆదాయం ఆరు శాతం
చొప్పున పెరిగింది.అనంతపురం జిల్లా విషయంలో ఇది కేవలం నాలుగుశాతం ఉంది.1955-56లో రాష్ట్ర సగటు కంటే ముందున్న అనంతపురం జిల్లా 1977-78నాటికి 98శాతానికి, 1990 దశకంలో 92 శాతానికి పడిపోయింది. అంటే ఆర్థికాభివృద్ధి పరుగు పందెంలో జిల్లా తలసరి వెనకబడుతున్న విషయాన్ని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

అనంతపురం జిల్లాను ఆదుకునేందుకు చర్యలు :

జై సల్మీర్ జిల్లాలో ఏర్పాటు చేసినట్లు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేయాలి.

డి.డి.పి.కి స్వతంత్ర ప్రతిపత్తిని కలిగించి ప్రత్యేకంగా ఐఎఎస్ అధికారిని నియమిస్తే పరిస్థితి మెరుగు
పడవచ్చు అంతేకాక ప్రతియేటా కనీసం 300 కోట్లు రూపాయలు కేంద్రం గ్రాంటుగా మంజూరు
చేయాలి.

పంటల బీమా పథకం మార్చాలి. ప్రీమియం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. అవసరమైతే
నేషనల్ లిమిట్ రిలీఫ్ ఫండ్ నుంచి ప్రీమియం చెల్లించాలి.


No comments:

Post a Comment