Monday, September 7, 2020

తుంగభద్ర ఎగువకాలువ పేజీ-1(TB dam higher level canal)




 

         దీనిని 1967లో పూర్తి చేశారు. దీనిలోని నీరు, ముచ్చుకోట కనుమల ద్వారా జాజికొండలోయలో పడుతుంది. అక్కడి నుంచి రెగ్యులేటర్ ద్వారా తాడిపత్రి బ్రాంచి కాలువకు నీళ్లు చేరుతాయి. జాజికొండ వాగులో ప్రవహించడం వలన బ్రహ్మాండం గా భూమి నీటి ఊట కలిగి భూగర్భజలం పెరిగి బావులలో నీటి సామర్థ్యం మెరుగుపడింది. ముచ్చుకోట కొండల పరిధిలోని 29వ ఉపకాలువ ద్వారా చిన్న ఇతర నీటివనరుల వల్ల 3000 ఎకరాల తరి ,ఆరుతడి పైరు ఆయకట్టు సాధ్యమయ్యింది.
         దశాబ్ద కాలంగా నీటి సరఫరా సాగినా ఆయకట్టు అభివృద్ధి తగినంత లేదు. రైతులు మొదట్లో తడి భూములను ఆరుతడి క్రింద మార్చ మని కోరారు. తరువాత తమ భూములను లోకలైజేషన్ నుంచి తొలగించమని కోరారు. వారు భూగర్భ జలాలు పెరగడం వలన పండ్ల తోటలను పెంచడమే సులభమని భావించారు. 
         సుబ్బరాయ సాగర్ రిజర్వాయర్ నిర్మించిన తరువాత భూగర్భజలవూట పెరిగి స్థిరత్వం ఏర్పడింది. తరువాత సమీప లోయలో ముచ్చుకోట బ్యాలన్సింగ్ రిజర్వాయర్ చేపట్టి దానిని సుబ్బరాయ సాగర్ తో జోడించి మొత్తం రెండింటికి నీటి వసతి 1.0 టి.యం.సి.లు ఏర్పాటు చేశారు.

No comments:

Post a Comment