Friday, September 11, 2020

మూఢ విశ్వాసాలతో కొట్టుమిట్టాడుతున్న రాయదుర్గం






          రాయదుర్గం పట్టణంలోని ప్రసన్న వెంకట రమణస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా
పదేళ్ల బాలికతో వెంకటరమణుని కళ్యాణం నిర్వహించారు.
         రాయదుర్గం పట్టణంలోని పద్మశాలిసామాజిక వర్గం ఆరవ వంశానికి చెందిన శివ 10ఏళ్ల కుమార్తె లలితకళ  అనే బాలికను పెళ్లి కూతురుని చేసి
మేళతాళాలు భజంత్రీలతో భక్తమార్కండేయస్వామి ఆలయం నుంచి కోటలో ప్రసన్నవెంకటరమణస్వామి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు.  
        ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన
కళ్యాణ వేదిక పై స్వామి ఉత్సవ విగ్రహాలను ఉంచి
ఎదురుగా పెళ్లికూతురు లలితకళ పద్మావతిని కూర్చోబెట్టి సంప్రదాయ బద్ధంగా వెంకటరమణ స్వామి కళ్యాణం జరిపించారు. పురోహితులు మంగళసూత్రాన్ని పద్మావతి ఉత్సవమూర్తి మెడకు తాకించి ఉప్పు పెళ్లి కుమార్తె మెడలో ఆమె తల్లి రేఖ మంగళ సూత్రం కట్టారు.
          దేవాదాయశాఖ సమూహ దేవాలయం
కార్యానిర్వహణాధికారి కె. శ్రీనివాసులు, మునిసిపల్
కమిషనర్ రామచంద్రారావు సమక్షంలో పెళ్లి తంతు
జరిగింది. రాయదుర్గం మాజీ శాసన సభ్యులు మెట్టు
గోవిందరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, రాయదుర్గం
పురపాలక సంఘ అధ్యక్షులు గొని ఉపేంద్రరెడ్డి
మునిసిపల్ వైస్ చైర్మన్ వెంకటేశులు, మునిసిపల్ వార్డు సభ్యులు భారతి, ప్రశాంతి, సుమలత అనేకమంది పట్టణ ప్రజల సమక్షంలో ఈ కళ్యాణం  జరిగింది. బాలికతోబాల్య వివాహం జరపడం నేరం. చట్టవిరుద్ధమని ప్రభుత్వం చెబుతోంది.
రాయదుర్గంలో దేవాలయ శాఖ ఆధ్వర్యంలోని వెంకట మరణస్వామి ఆలయంలో 40ఏళ్లుగా బాలికతో వెంకటరమణుని కళ్యాణం జరుగుతోంది.
రాయదుర్గంలో కూడా 1978వ సంవత్సరానికి ముందు లేదు. ఇది అశాస్త్రీయం, సాంప్రదాయ విరుద్ధమని తెలిసినా అధికారికంగా గత నాలుగు దశాబ్దాలుగా ఈ పద్ధతిని పాటిస్తున్నారు. ఈ విషయమై రాయదుర్గం హెరిటేజ్ అసోషియేషన్ అధ్యక్షులు, రాయదుర్గం చరిత్ర గ్రంధ రచయిత హులికుంటు మూర్తి వెంకటేశ్వరునిబ్రహ్మోత్సవాలకు సంబంధించిన పాత రికార్డులను వెలికి తీశారు. 1978వ సంవత్సరానికి ముందు బాలికతో
వెంకటేశ్వరుని పెళ్లి జరిపిన దాఖలాలు లేవన్నారు. ఈ సంప్రదాయం విడనాడాలని తాము గత కొన్ని
సంవత్సరాలుగా దేవాదాయశాఖ  అధికారులకు
తెలుపుతూ వస్తున్నట్లు చెప్పారు. ఈ విషయమై ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు, ముందు దేవాదాయ
కార్యానిర్వహణాధికారి, ఉన్నతాధికారులకు వినతి
పత్రాన్ని పంపగా బ్రహ్మోత్సవాల నిర్వహణ పై గత నెల 28న ఆలయంలో కార్యానిర్వహణాధికారి ఆద్వర్యంలో సమావేశం జరిపారు. హుళికుంటు మూర్తి మినహా తక్కిన వారు మూఢ విశ్వాసంతో కళ్యాణం జరిపించాలని కోరారు.

(ప్రజాశక్తి ,మంగళవారం 21 మే 2019)

No comments:

Post a Comment