చెరువుల సాగునీటి సౌకర్యం వల్ల ఈ జిల్లాలో చాలావరకు ప్రజాజీవనం కొనసాగేలా చేసింది.
చెరువుల పూడిక వలన, నీరు ఆవిరి కావడం, తరచుగా తెగిపోవడం, సరియైన నీటి పారుదల
నిర్వహణ లేకపోవడంవల్ల చెరువుల సార్థకత చాలా తగ్గిపోయింది. జిల్లాలో 2487 చెరువులున్నాయి. అందులో 100ఎకరాల ఆయకట్టుపైన ఉన్న చెరువులు305. ఇందులో క్రీ.శ. 14-17 శతాబ్దాలలో విజయనగర రాజులు చాలా వరకు కట్టినవే ఉన్నాయి ఈ చెరువుల క్రింద సాగయ్యే మొత్తం భూమి 54500 హెక్టార్లు.
జిల్లాలో ముఖ్యమైన చెరువులు (ఎకరాల సాగు)
1) బుక్క పట్నం చెరువు 2972
2)గుత్తి చెరువు 1037
3) పరిగి చెరువు 2851
4) వై.టి. చెరువు 903
5) శింగనమల చెరువు 2524
6)కంబదూరు చెరువు 963
7) ధర్మవరం చెరువు 1922
8) హిందూపురం చెరువు 1130
9) కొట్నూరు చెరువు 1509
10) కుంటిమద్ది చెరువు 490
11) అనంతపురం చెరువు 2511
No comments:
Post a Comment