Sunday, September 6, 2020

దేశస్వాతంత్ర్యం కోసం రాయదుర్గం ప్రాంత ప్రజలు‌చేసిన పోరాటాలు


            రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన ప్రజలు స్వాతంత్ర్య సమరంలో మేము సైతం అంటూ ఎన్నో త్యాగాలు చేశారు. దేశస్వాతంత్ర్యం కోసం రాయదుర్గం ప్రాంత ప్రజలు‌చేసిన పోరాటాలు చరిత్ర లో నేటికీ సజీవంగానే ఉన్నాయి.జాతిపిత మహాత్మా గాంధీ పిలుపు మేరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి జైలు శిక్ష అనుభవించారు రాయదుర్గానికి చెందిన స్వాతంత్ర్య సమర యోధులు.ఉప్పుసత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని పేరుగాంచారు. పురుషులకు దీటుగా తామేమీ తీసిపోమంటూ అప్పట్లోనే పలువురు మహిళలుస్వాతంత్ర్య సమరంలో పాల్గొని ప్రశంసలు పొందారు. పట్టణానికి చెందిన సత్యభామాదేవి లాంటి మహిళలు స్వాతంత్ర్య ఉద్యమంలో దూకి తమవంతు పాత్ర పోషించారు. ప్రస్తుతం నాటి సమరయోధులంతా కాలధర్మం చెందారు. కాని వారి త్యాగాలకు గుర్తుగా దేశస్వాతంత్ర్యానికి చిహ్నంగా 1972లో రాయదుర్గం మండలం లోని 71 ఉడేగోళం గ్రామం వద్ద ఒక చిహ్నాన్ని ఏర్పాటుచేశారు. ఏటా స్వాతంత్ర్య దినోత్సవం రోజున నియోజకవర్గంలో స్వాతంత్ర్య సమరయోధులకు అక్కడ నివాళులు నివాళులర్పిస్తున్నారు. 
పట్టణానికి చెందిన  స్వాతంత్ర్య సమర యోధుడు ఓబుళాచారి పేరును ఒక కాలనీకి పెట్టారు.ఆనాటి సమర యోధుల విశేషాలు 1980లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో రాయదుర్గం నుంచి వరదా చెన్నప్ప తిప్పయ్యలు గాంధీజీ వెంట నడిచి కర్ణాటకలోని కార్వారు జైలులో మూడు నెలల జైలు శిక్ష అనుభవించారు రాయదుర్గానికి చెందిన ఆర్ నాగన్న గౌడ్ 1941లో వ్యక్తి సత్యాగ్రహం చేసినెల్లూరు, తమిళనాడులోని తిరుచునాపల్లిలో ఏడాదిపాటు జైలు శిక్ష అనుభవించారు. అప్పట్లోనే బ్రిటీష్ ప్రభుత్వానికి రూ 400ల జరిమానా చెల్లించారు. అదే ఏడాది ప్రముఖ గాంధేయవాది రాయదుర్గం తొలి ఎమ్మెల్యే జి నాగభూషణం క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని బెంగళూరు కేంద్ర కారాగారంలో మూడు నెలల సాధారణ జైలు శిక్షను అనుభవించారు. పట్టణానికి చెందిన హెచ్ సుబ్బారావు, మహిళల్లో సత్యభామా దేవి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. ఎన్ సి శేషాద్రి‌తొలి పాత్రికేయుడు నిప్పాణి రంగారావు,మోపూరి చంద్రకాంతం నాయుడు. శరణప్పలు ఉద్యమంలో పాల్గొన్నారు. రాయదుర్గం మండలంలోని నాగిరెడ్డిపల్లికి చెందిన కట్టారావుప్ప కాశీపురానికిచెందిన ఎం వీరయ్య జగన్నాధ్ సింగ్ గుమ్మగట్ట మండలం లోని సిరిగే దొడ్డికి చెందిన దామోదర్ సింగ్ లు  స్వాతంత్ర్య సమరంలో పాల్గొని బ్రిటీష్ పోలీసుల చేతిలో ఎన్నో చిత్రహింసలు పొంది జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్యం తర్వాత వీరు పింఛన్లు పొందారు.


No comments:

Post a Comment