Saturday, September 5, 2020

కరువు జిల్లాకు సేద్యపు నీటి పథకాలు సాధ్యమే






       ఆనంతపురం జిల్లా 1050-1100 మీ.సముద్రమట్టం కన్నా  ఎత్తైన ప్రాంతంలో ఉంది. మనకన్నా కృష్ణానది లోతట్టులో పారుతోంది. కృష్ణానీటిని మళ్ళించుకోవాలంటే ఎత్తిపోతల పథకాలు అమలు చేయాలి. కానీ తుంగభద్ర జలాశయం మనకన్నా ఎత్తులో ఉంది. దాదాపు 500 ఎం.ఎస్.ఎల్. తేడా వుంది. ఆ ప్రాంతం 633ఎం.ఎస్.ఎల్ లో వుంది. నీటిని గురుత్వాకర్షణ ద్వారా మనం సులభంగా పొందవచ్చు. తుంగభద్ర, భీమా, హంద్రి, దిండి, మూసి ఉపనదులు ఉన్నాయి. కృష్ణాకు అధిక నీరందించే ఉపనది తుంగభద్ర మాత్రమే. కృష్ణానదికి 2390టి.ఎం.సి అడుగుల నీరులభిస్తున్నట్లు బచావత్ ట్రిబ్యునల్ లెక్కవేసింది. మూడు రాష్ట్రాలకూ కృష్ణానది నీటిని కేటాయించేందుకు బచావత్ నేతృత్వంలో కృష్ణాజలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ ఏర్పాటైంది. లభిస్తున్న నీటిలో 75శాతం విశ్వసనీయత ఆధారంగా 2060టి.ఎం.సి. అడుగుల నీరు నికరంగా లభిస్తున్నట్లు లెక్కకట్టారు. ఇందులో తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి ఆయకట్టుకు విడుదల చేస్తున్న 212టి.ఎం.సి.,ల నీరు కూడా ఇందులో ఉంది. మిగులు జలాల కింద 330టీ.ఎం.సి.ల నీటిని అంచనా వేశారు. ఈ నీటికి 25 శాతం విశ్వసనీయత ఉంటుంది. ఈ నీరు వస్తే వస్తుంది, లేకపోతే లేదు. మిగులు జలాలను ఏ ప్రాజెక్టుకూ కేటాయించలేదు. అందువల్ల మిగులు జలాలు ఉపయోగించుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ కు లభించింది. అయితే ఇంతవరకు మిగులు జలాలను ఉపయోగించు కోవటంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. 30 ఎళ్ళు గడిచిపోతున్నా, బచావత్ గడువు మీరిపోయినా ఆనీటిని ఇప్పటికీ సద్విని యోగం చేసుకోలేక పోయాము. ఆ నీటిని వినియోగించుకొని సాగునీటి పథకాలను సాగునీటి పథకాలను చేపట్టివుంటే నీటిపై హక్కు లభించేది. మళ్ళీ ట్రిబ్యునల్ ఏర్పాటైతే సమీక్ష చేసినప్పుడు ఆ ప్రాజెక్టులకు నీటికేటాయింపు లభించేది. రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా మిగులు జలాలను ఉపయోగించుకుని గాలేరు - నగరి, హంద్రీ-నీవా,ఎస్.ఎల్.బి.సి., నెట్టెంపాడు, భీమా తదితర సాగునీటి పథకాలను రూపొందించింది. ఈ పథకాలన్నీ అమలు చేసినా కేవలం 240 టి.ఎంసి.ల మిగులు జలాలను మాత్రమే వినియోగించుకోవటంసాధ్యమయ్యేది. కానీ ఇప్పటివరకు అవి అమలుకు నోచుకోలేదు. ఈ విధమైన పరిస్థితి ఏర్పడడానికిమన ప్రజా ప్రతినిధులే కారణం. ప్రజా ప్రతినిధులు ఒత్తిడి తెచ్చివుంటే అమలు జరిగేది. ఆ పథకాల కోసం ఒత్తిడి తెచ్చేవారే కనుమరుగయ్యారు. వాస్తవాలను పత్రికలు ఇంకా బాగా తెలియజేస్తేనమ్మకం, గౌరవం పెరుగుతుంది. కృష్ణానది నుంచి ఆంధ్రప్రదేశ్ కు 800టి.ఎం.సి.లు, కర్నాటకకు 700, మహారాష్ట్రకు 560టి.ఎం.సి.ల చొప్పున కేటాయించారు. తుంగభద్ర జలాశయం నుంచి 2124.ఎం.సి.లు నీరు కూడా రాష్ట్రానికి కేటాయించిన కృష్ణాజలాలలో ఇమిడి ఉంది. అందులో 73టి.ఎం.సి.లు ఆంధ్రప్రదేశ్ కు, 139 కర్నాటకకు కేటాయించారు. 1950లో ఈ పథకం ప్రారంభించి నాలుగేళ్ళలో పూర్తి చేశారు. అప్పట్లో మన ప్రభుత్వం, కర్నాటకతో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల మనకు అన్యాయం జరిగింది. మనకు ఎక్కువ విద్యుత్ కావాలని కోరాము. తక్కువ నీటిని తీసుకునేందుకు అంగీక రించాము. అప్పటి పరిస్థితులకు అది సరియైనదే కావచ్చు. అప్పట్లో మనం విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇచ్చాము. విద్యుత్ ఉత్పత్తికి తర్వాత కాలంలో చాలా ప్రాజెక్టులు నెలకొల్పాము.ఇప్పుడు ఎక్కడ చూసినా నీటికి తీవ్ర ఒత్తిడి ఉంది. నీరు అదనంగా పొంది వుంటే మనపరిస్థితి ఇప్పుడు బాగుండేది. ముందుచూపుతో ఆలోచించకపోవడం వల్ల అప్పుడు అన్యాయం జరిగింది. అందువల్ల మనం తక్కువ నీటిని పొందుతున్నాము.

        కృష్ణా నదినుంచి రాష్ట్రానికి 800టి.ఎం.సి.లు కేటాయిస్తే అందులో హెచ్.ఎల్.సి. 32.5 టి.ఎం.సి.లు మూడు జిల్లాలకు కేటాయించారు. అందులో 22టి.ఎం.సి.లు అనంతపురం జిల్లాకు లభించింది. అంటే రాష్ట్రానికి లభిస్తున్న 800టి.ఎం.సి.లలో అనంతపురం జిల్లాకు ఇస్తున్నది కేవలం 22టి.ఎం.సి.లు మాత్రమే. దీనినిబట్టి 2.3 శాతం మాత్రమే నీరు మనకు లభిస్తోంది.హెచ్.ఎల్.సి.కి 32.5టి.ఎం.సి.లు కేటాయించినా జలాశయం సామర్థ్యం పూడికతో తగ్గినందున 26టి.ఎం.సి.లు మాత్రమే లభిస్తోంది. అందులో కర్నూలు, కడప జిల్లాల్లోని ఆలూరు, పులివెందుల కాలువలు మైలవరం జలాశయానికి పోనూ అనంతపురం జిల్లాకు లభించింది 16 నుండి 20 టి.ఎం.సిలోపే. జిల్లాలో, చెరువులన్నీ నిండితే కూడా అంతమొత్తం నీరు లభిస్తుంది. తుంగభద్ర జలాశయం నుంచి రెండు రాష్ట్రాల్లోని సాగునీటి వ్యవస్థలకు 2124.ఎం.సి.ల నీటిని కేటాయించాలి. రిజర్వాయర్ సామర్థ్యం 133టి.ఎం.సిల అడుగులు కాగా పూడికవల్ల సామర్థ్యం తగ్గిపోయింది. 1993లో జరిపిన సర్వే ప్రకారం 111.5టి.ఎం.సి.ల సామర్థ్యం ఉంది. అంటే 21.5టి.ఎం.సి.ల మేర పూడిక ఏర్పడింది. ఇప్పటికి పూడిక పెరిగి సామర్థ్యం 25-26టి.ఎం.సిలకు తగ్గివుంటుంది. తుంగభద్ర జలాశయం కర్నాటకలో ఉన్నందున సహజంగానే అక్కడివారు అదనంగా నీటిని తీసుకొనే అవకాశంవుంది. అయితే దానికి మనకు నీటి రవాణా నష్టాలకింద చూపిస్తున్నారు,
నీటి విషయంలో మనకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమే కదా!

అనంతపురం జిల్లాలోని నదులు - అవి ప్రవహించే మండలాలు

1) పెన్నానదీ (పరివాహక ప్రాంతం 8869చ.కి.మీ) హిందూపురం,రొద్దం,రామగిరి,కంబదూరు కనగానిపల్లి, వజ్రకరూరు,కళ్యాణదుర్గం, బెళుగుప్ప కూడేరు, ఉరవకొండ ,పామిడి,గార్లదిన్నె,శింగనమల పెద్దపప్పూరు,తాడిపత్రి

2) చిత్రావతి (పరివాహక ప్రాంతం 6031చ.కి.మీ)
చిలమత్తూరు గోరంట్ల పుట్టపర్తి చెన్నేకొత్తపల్లి ధర్మవరం,బత్తలపల్లి తాడిమర్రి ముదిగుబ్బ యల్లనూరు

3) వేదవతి (పరివాహక ప్రాంతం 2354చ.కి.మీ)
గుమ్మగట్ట ,బ్రహ్మసముద్రం ,రాయదుర్గం ,బెళుగుప్ప కణేకల్,బొమ్మనహాల్

4) పాపాఘ్ని (పరివాహక ప్రాంతం 1187 చ.కి.మీ)
తనకల్లు ,ఎస్.పి. కుంట,పరిగి,పెద్దవడుగూరు

No comments:

Post a Comment