Sunday, September 6, 2020

గవి సిద్దేశ్వరుడు


అనంతపురం జిల్లాలో వాయువ్యంగా బళ్ళారికి
సమీపంలోని డి.హీరేహాల్ మండలంలో రాగి
పర్వతాల్లో సూగూలమ్మ గుట్టపై గవి  సిద్దేశ్వరుడు వెలిశాడు. 6 శతాబ్దాల చరిత్ర గలదీ ఆలయం. వృక్ష, జంతు జలాలను రక్షించేందుకు గవి సిద్దేశ్వరుని రూపంలో స్వయంగా శివుడే ఇక్కడ వెలిశాడని భక్తాదుల నమ్మకం.
          విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరా యల కాలంలో సుబేదారుగా పనిచేసిన మల్లప్ప ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలున్నాయి. కర్నాటకలోని బళ్ళారి జిల్లా గుడేకోట సమీపంలో గల సోమవార దుర్గానికి చెందిన గవి మఠాధిపతి సిద్ధప్ప సూగాలమ్మ గుట్టకు వచ్చి స్థిరపడ్డాడు అంటారు. సుబేదారు మల్లప్ప, సిద్దప్పలు విజయనగర రాజులను ఒప్పించి ఆలయాన్ని నిర్మించి, కొన్ని గ్రామాలను మాన్యాలు గా ఇప్పించారని  బళ్ళారి జిల్లా గెజెట్ లో రాసినట్లు ఆలయ చరిత్ర  వ్రాసిన కీ.శే. వై.నాగేశశాస్త్రి పేర్కొన్నారు.
          ఆరు శతాబ్దాల చరిత్ర గల ఆలయం ఇటీవల అభివృద్ధి చెందుతోంది. ఆలయానికి మాన్యాలున్నా చాలా కాలంవరకు అభివృద్ధికి నోచుకోలేదు. స్థానికంగా హీరేహాలుకు చెందిన పార్లమెంట్ సభ్యుడు హెచ్.జి.రాయులు మరియుఇబ్రహీంసాబ్ చొరవ తీసుకోవడంతో ఆలయం అభివృద్ధి చెందుతోంది. 
       కంచికామకోటి పీఠాధిపతి   జయేంద్ర సరస్వతి ,  శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల ఆద్వర్యంలో  సహస్రచండీయాగం జరిపారు. 
             రాయదుర్గం సమీపంలో లింగాల బండ
వద్ద గల చతుర్ముఖ పశుపతి ఆలయంలో 101 శివలింగములు ఉండగా, గవిసిద్దేశ్వరుని ఆలయం లో 1982 సంవత్సరంలో 188 శివలింగములను ప్రతిష్టించారు. ఆలయ ప్రాంగణంలో 1989 లో  గణపతి, గౌరీదేవి, రేణుకాచార్య విగ్రహాలు ప్రతిష్టించారు.
      గవిసిద్దేశ్వరుని ఆలయం గల సూగాలమ్మగుట్ట రాగి పర్వత శ్రేణులో ఒక భాగం పేరుకు రాగి పర్వతాలైనా ఇచ్చట ఇమము-ఉక్కు తయారీకి ఉపయోగపడే మేలు రకం మాంగనీస్, క్వార్ట్జ్ ఖనిజాలు లభ్యమవుతాయి.
         రాగిపర్వత ప్రాంతాల్లో సహజసిద్ధమైన చిట్ట డవులు ఉన్నాయి. ఈ పర్వతాలు పూర్వం దట్టమైన అడవులు, జంతు, వృక్ష సంపదచే అలరారు చుండేవి.

ఈ పర్వతాలపై కురిసే వర్షాలతో ఆలయసమీపంలో గల ఒక గుహ నుండిడి నీరునిరంతరం ప్రవహిస్తుండేది. గుహ(గవి) సమీపంలో  ఆలయం ఉన్నందున గవిసిద్దేశ్వరుడని  పిలిచేవారు.     
          ఆంగ్లేయులు మన దేశాన్ని పాలించే రోజుల్లో
 బళ్ళారి కంటోన్మెంట్  సైనికులు, ఆంగ్లేయ అధికా రులు తరచూ ఆలయ ప్రాంతాన్ని సందర్శించి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేవారు.

          రాగిపర్వాతాల్లో లభించే ఇనప ఖనిజతవ్వకం వల్ల ప్రభుత్వానికి లక్షలాది రూపాయలు రాయల్టీ రూపంలో ఉండేది. ప్రభుత్వం హీరేహాలు నుండి ఆలయం వరకు రోడ్డు మార్గం భక్తుల సౌకర్యార్థంవేయించింది.
         ఆర్.టి.సి. రాయదుర్గం నుండి ఆలయానికి ప్రతిరోజు 6 సింగల్స్ సర్వీసును నడుపుతోంది. మంగళవారం రోజుల్లో బళ్ళారి వైపు మండి ఓ ప్రైవేటు బస్సు కూడా తిరుగుతోంది.

No comments:

Post a Comment